నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ”ఇటీవల
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడును ఈడ్చి కొట్టిన తర్వాత ఆయనకున్న చిటికెడు మెదడు కూడా మరింత చిట్లినట్లుందని విమర్శించారు. మీ తండ్రి
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,మీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో హోంమంత్రి చిదంబరం కాళ్ళు పట్టుకుని మాపై కుట్రలు చేశారు. ఇప్పుడు అదే చిదంబరం ,ఆయన కొడుకు బెయిల్ పై ఉన్నారు. మీ
నాన్న నాయకత్వంలో దొంగల ముఠాకు మూడే రోజు దగ్గరలోనే ఉంది అని ఆయన విమర్శల వర్షం కురిపించారు..
