రాగల 24గంటల్లో…ఇది చెప్పగానే ఎవరు,ఏమ్ జరుగుతుంది అని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తారు.చాలా మంది భయపడతారు కుడా.కాని రాగల 24గంటల్లో అనేది ఒక సినిమా..దీనికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, ఎస్ఎన్సి క్రియేషన్స్ బ్యానర్పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.వార్తల్లో వాతావరణం గురించి చెప్పినప్పుడు రాగల 24గంటల్లో అని మొదలుపెట్టి.. ఎలా ఉండబోతుంది దీనికి ఎలా స్పందిస్తారు అనే విషయాలతో ఈ సినిమా చాలా ఆశక్తికరంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈమేరకు ఇప్పటికే చిత్ర పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.దీనికి మంచి స్పందన కూడా రావడం విశేషం.