Home / 18+ / “వైఎస్సార్ తో నేను కలిసి పనిచేసాను.. మీ న్యాయకత్వంలో రైతులకోసం” అంటూ అమూల్యమైన సందేశాన్నిచ్చిన స్వామినాధన్

“వైఎస్సార్ తో నేను కలిసి పనిచేసాను.. మీ న్యాయకత్వంలో రైతులకోసం” అంటూ అమూల్యమైన సందేశాన్నిచ్చిన స్వామినాధన్

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేసారు. సీఎం జగన్‌ నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని రైతులకోసం ప్రవేశపెట్టిన వైయ‌స్సార్‌ రైతు భరోసా పథకంపై స్వామినాథన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈపథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైయ‌స్సార్‌తో రైతులకోసం అనేకసార్లు కలిసి పనిచేశానని స్వామినాధన్ పేర్కొన్నారు. ‘మీ నాయకత్వంలో రైతులకోసం చేపట్టే కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని జగన్‌ను ఉద్దేశించి ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి అప్పుడే ప్రముఖ శాస్త్రవేత్త అభినందనలు అందుకోవడంతో సీఎం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat