వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సచివాలయంలో పలు బ్లాక్లలో గదులను కేటాయించారు.
రెండో బ్లాక్ లో…
* 215 నంబర్ గదిని డిప్యూటీ సీఎం, రెవిన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు..
*వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు 208
* మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు 135
* దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు 137
* హోంమంత్రి మేకతోటి సుచరితకు 136
* విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డికి 211
* ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్కు 212 గదులను కేటాయించారు.
మూడోబ్లాక్ లో..
గది నంబర్ 203 ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి..
* ఉపముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్ బాషాకు 212
* సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్కు 211
* కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్కు 207
* పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్కు 210 నంబర్ గదులను కేటాయించారు.
నాలుగో బ్లాక్ లో…
*గది నంబర్ 127ను ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామికి…
* గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజుకు 211
* పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానికి 130
* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు 210
* మత్స్యశాఖ మంత్రి వెంకటరమణకు 132
* జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్కు 212
* ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి 208
* బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణకు 131 ను కేటాయించారు.
ఐదో బ్లాక్ లో…
గది నెంబర్ 191ను ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానికి…
* రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్కు 193
* మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు 210
* రవాణా, సమాచార శాఖమంత్రి పేర్ని నానికి 211
* పంచాయతీ రాజ్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 188 గదిని కేటాయించారు.