తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. 32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది. 32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది. కారు స్పీడుకు కాంగ్రెస్, బీజేపీ అడ్రస్లు గల్లంతయ్యాయి.
మొత్తం 534 జడ్పీటీసీ, 5,659 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ 3555, కాంగ్రెస్ 1376, బీజేపీ 211, ఇతరులు 592 స్థానాల్లో గెలుపొందారు. జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 428, కాంగ్రెస్ 72, బీజేపీ 7, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ దూసుకెళ్తుండటంతో..రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.