ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను సైతం జగన్ ఆహ్వానించారు. మరి ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేకపోయినా… బీజేపీ కీలక నేత ఎవరైనా ఈ కార్యక్రమానికి వస్తారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే తెలంగాణలో రాష్ట్రంలో వైఎస్ జగన్ కు భారీగా అభిమానులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల్లనే హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లను జగన్ దంపతులు కలిశారు. దీంతో జగన్ కు తెలంగాణలో మరింత అభిమానులు పెరిగారు. ఇందులో బాగాంగానే వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి సూమారుగా 2వేల వాహానాలతో తెలంగాణ రాష్ట్రం నుండి ఈ రోజు సాయంత్రం విజయవాడ బయల్దేరుతున్న వార్తలు వస్తున్నాయి.
