వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు శనివారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. శనివారం ఉదయం సరిగ్గా 10.31 గంటలకు వైఎస్సార్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. శాసనసభాపక్షం నేతగా జగన్ను ఎన్నుకున్న తర్వాత వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవడానికి హైదరాబాద్ బయలు దేరుతున్నారు. జగన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.
