Home / ANDHRAPRADESH / నేడు సీఎం కేసీఆర్‌ను కలవనున్న జగన్‌

నేడు సీఎం కేసీఆర్‌ను కలవనున్న జగన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారు. అమరావతిలో శనివారం ఉదయం 10.31 గంటలకు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం జగన్ హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలువనున్నారు. తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఈ ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇంతటి ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌కు ఇప్పటికే సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat