చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని ఆరోపించారు. మరో 24 గంటల్లో రాష్ట్రంలో రాజన్న పాలనా రాబోతుందని చెప్పారు.
