వివాదాస్పదమైన టీవీ9 రవిప్రకాష్ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. సంస్థ సీఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ డైరక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. శుక్రవారం ఏబీసీఎల్ బోర్డు డైరెక్టర్లందరూ సమావేశం అయ్యారు. టీవీ9లో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్కు మధ్య తీవ్ర వివాదం నెలకొనడంతో కొత్త యాజమాన్యం ఇవాళ సమావేశమై కొత్త సీఈఓనుా నియమించింది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న రవిప్రకాష్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఛానెల్కు ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈయనను ప్రస్తుతం 10 టీవీకి ఎడిటర్గా పనిచేస్తున్న గొట్టిపాటి సింగారావును సీఓఓగా నియమించారు. ఈ విషయాన్ని ఏబీసీఎల్ డైరెక్టర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
