ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వచ్చి కధలు చెప్పినప్పటికే ఏది ఓకే కాలేదు.
అయితే 2004లో ఆర్యతో తన మొదటి చిత్రం చేసిన సుకుమార్ మంచి హిట్ కొట్టాడు.ప్రస్తుతం బన్నీకి కధ చెప్పగా ప్రాజెక్ట్ ఫైనల్ చేయడంతో..ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలు హిట్ కావడంతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్ను వేసారు.ఇది తనకి 20వ చిత్రం కావడంతో దీనికి బన్నీ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించనున్నాడు.సుకుమార్ ,అల్లుఅర్జున్ కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ఈ నెల 11న లాంచ్ చేయనున్నారు.ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు.