ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అయన యూపిఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ కి సపోర్ట్ ఇవ్వకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఓ వైపు తెలంగానలో రోజురోజుకి టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య తీవ్రమైన ఫైట్ నడుస్తుండంతో ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.