వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబు ఫై ధ్వజమెత్తారు.ఏపీ ఎన్నికలకు సంబంధించి మొదటినుండి సీఈవో ద్వివేది పై చంద్రబాబు ఏదోక ఆరోపణ చేస్తూనే వచ్చారని.బాబు ఓడిపోతరనే భయంతోనే కావాలని ఆయనను నిందిస్తున్నారని మండిపడ్డారు.తన ట్విట్టర్ ద్వారా విజయసాయి రెడ్డి..సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పనిచేసుకొనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. ప్రకృతిని హ్యాండిల్ చేసిన మొనగాడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించిన కీలకాంశం ఇది. ప్రజల పరువు తీయమాకు స్వామీ! అంటూ ట్వీట్ చేసారు.తన రాసిన లేఖలో ఏమీ రాయాలో తెలియక ఇలా పిచ్చిగా చేసారని ఆయన అన్నారు.
సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పనిచేసుకొనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. ప్రకృతిని హ్యాండిల్ చేసిన మొనగాడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించిన కీలకాంశం ఇది. ప్రజల పరువు తీయమాకు స్వామీ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2019