సుజనా చౌదరి..ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది భారీ కుంభకోణాలే.ఎందుకంటే ఈయన పైన కొన్ని కోట్ల మేర మోసం చేసారని కేసులు కూడా ఉన్నాయి.అంతే కాకుండా సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీగా ఉన్నారు.ఇవ్వని పక్కన పెడితే ఈయన చంద్రబాబుకు మంచి సన్నిహితుడు కూడా.ఇందులో చంద్రబాబుకు కూడా హస్తం ఉండే ఉంటుంది.సుజనా ఇప్పుడు హుటాహుటిన సీబీఐ ఆదేశాల మేరకు బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది.2017 లో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారం కేసులో భాగంగా బెంగళూరు బ్రాంచ్ సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేయడంతో ఈరోజు బెంగుళూరు వెళ్ళాడు.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.315 కోట్ల విలువైన ఆస్తులను స్వాదినం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ కంపెనీ వ్యవహారంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లను మోసం చేసారని ఈడీ చెప్పింది.ఇవే కాకుండా సుజానా చౌదరిపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి.
