ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుండి లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ పోలింగ్ లో భాగంగా ఓ బూత్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.పోలింగ్ వీవీప్యాట్లో ఓ పాము దర్శనమిచ్చింది.దీంతో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన చెందారు.ఎలాగైతేనో మొత్తానికి ఆ పాముని వీవీప్యాట్ నుంచి తీసి కొంచెం దూరంలో వదిలేయడంతో పోలింగ్ కొంచెం ఆలస్యంగా మొదలైంది.వీవీప్యాట్లోకి పాము ఎలా, ఎప్పుడు దూరిందనే విషయం ఎవరికీ అర్ధం కావడంలేదు.ఇదంతా కేరళలోని కన్నూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్ కందక్కయ్ పోలింగ్ బూత్లో చోటుచేసుకుంది.
