పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన రవాణా వ్యాపారి వీరపనేని రవికాంత్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆయనకు సి.ఎమ్. ఆఫీస్ నుంచి దొరబాబు, శ్రీనివాస్ లు పోన్ చేసి ఎనిమిది కోట్ల డబ్బు లు పంపాలని బెదిరించారని ఆరోపించారు. శ్రీ చైతన్య సంస్థ ఇస్తానని చెప్పిన 500కోట్ల రూపాయలు ఇవ్వలేదని,దాంతో ముఖ్యమంత్రి తరపున ఆయా వ్యాపారులను డబ్బులు ఇవ్వాలని కోరుతున్నామని వారు చెప్పారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీస్ నుంచి ఈ పోన్ లు వచ్చాయని ఆయన చెప్పారు. దొరబాబు అనే వ్యక్తి టీడీపీ తరపున విశాఖపట్నంలో ఉప మేయర్ గా పనిచేశారని ఆయన అన్నారు.ఏపీలో ఉండకుండా హైదరాబాద్ లో ఉన్నానంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చని ఆయన అన్నారు.