వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన భార్య వైయస్ భారతి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆమె రోడ్షో నిర్వహించారు. భారతికి జమ్మలమడుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఎస్ జగన్ను ప్రజలు బాగా నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మూల సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ పులివెందులలోనూ గతంలో భారతి ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని.. వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పెరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను తిప్పికొట్టడానికి మార్పు అనివార్యంగా భావించి ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని భారతి కోరారు.
