ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కల్సి పావులు కదిపిన సంగతి తెలిసిందే. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం టీడీపీలో చేరేందుకు వెనకడుగు వేశారు. ఎందుకంటే డీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని ఆయన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో బాగాంగానే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలోకి చేరెందుకు సిద్దమయ్యారు. ఎల్లుండి ప్రతి పక్షనేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కాజీపేటలో డీఎల్ రవీంద్రారెడ్డిని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్.అవినాష్ కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి డీఎల్ సుముఖత వ్యక్తం చేయడంతో ఎల్లుండే ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
