ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎలాగైనా గెలవాలని ” హత్యలు చేస్తున్నారు, వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఓట్లు తొలగించారు, రౌడీయిజం, ఓటర్లను బెదిరించడం చేస్తున్నారు… ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా మీ ఘోర పరాజయం ఖరారై పోయింది చంద్రబాబూ. తండ్రీ కొడుకులిద్దరూ సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి ” అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో “వచ్చే మూడు వారాలు అత్యంత కీలకం. చంద్రబాబు అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేసిన కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా శ్రమించాలి. చంద్రబాబు కట్ల పాములాంటి వాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కసితీరా కాటేస్తాడు. పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్తా యోధుడిలా పోరాడాలి ” అని పార్టీ కార్యకర్తలకు సూచించారు విజయసాయి రెడ్డి.
హత్యలు చేస్తున్నారు, వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఓట్లు తొలగించారు, రౌడీయిజం, ఓటర్లను బెదిరించడం చేస్తున్నారు… ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా మీ ఘోర పరాజయం ఖరారై పోయింది చంద్రబాబూ. తండ్రీ కొడుకులిద్దరూ సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 20, 2019