*వైయస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది.
*1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
*రాజారెడ్డి హత్యలో సైతం టిడిపి ప్రమేయం ఉంది.
*హంతకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్షణ కల్పించారు.
*వైయస్ జగన్ పై ఎయిర్ పోర్ట్ లో హత్యయత్నం చేస్తే అందులో టిడిపి వారే నిందితులు.
*గంట కూడా గడవకముందే స్వయంగా డిజిపి స్టేట్ మెంట్ ఇస్తారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది మా పరిధిలోనే కాదు అని అంటారు.
*అడిషనల్ డిజి వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ లన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించాల్సిన అదికారి టిడిపికి తాబేదారుగా ఉన్నారు.
*పోలీసు వ్యవస్దనంతటిని గత ఐదు సంవత్సరాలుగా భ్రష్టుపట్టించారు.
*గత ఐదేళ్లలో రాష్ర్టంలో జరిగిన ప్రతి హత్యలో కూడా టిడిపి పాత్ర ఉంది.
*చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా హత్య చేసి ఆ కేసును నీరుగార్చారు.
*రాష్ర్ట పోలీసులపై మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.సిట్ విషయానికి వస్తే తిరిగి డిజి ఆద్వర్యంలోనే పనిచేస్తుంది.ఆ డిజిపైనే మాకు నమ్మకం లేనప్పుడు ఆ సిట్ ఏరకంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.
*ఎవరైతే ఈ హత్య చేసారో వారిని చట్టానికి అనుగుణంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
*వైయస్సార్ కుటుంబాన్ని అంతమొందించాలనే కుట్రలో భాగంగా వివేకానందరెడ్డి హత్య జరిగింది.ఇందులో మంత్రి ఆదినారాయణరెడ్డి,చంద్రబాబు,లోకేష్ ల పాత్ర ఉంది.హత్యా కుట్రను అమలు చేసింది మంత్రి ఆదినారాయణరెడ్డి
*వివేకానందరెడ్డి కి కుటుంబకలహాలు ఏమి లేవు,జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా
వివేకానంద రెడ్డి పనిచేస్తున్నారు.
*వైయస్సార్ కుటుంబంలో ఆయన కుటుంబపెద్ద.ఆయన ముందు దిశానిర్దేశం చేస్తా వచ్చారు.
*ఏనాడు ఆయన లోక్ సభకు పోటీ చేస్తానని అనలేదు.
వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో వివేకానందరెడ్డి పనిచేస్తున్నారు.
*ఇలాంటి దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తోంది.
*డిజిపి మార్పును ఇప్పుడే కాదు గతంలోనే మేం డిమాండ్ చేశాం.
*బిజేపికి,టిడిపికి అనుభందం కొనసాగుతున్నందువల్లనే డిజిపి మార్పు జరగలేదు.డిజిపి టాగూర్ చంద్రబాబు
అడుగులకు మడుగులు వత్తుతున్నాడు.
*షెడ్యూల్ ప్రకటనకు ముందు కూడా డిజిపిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.
*తెలుగుదేశం పార్టీ తెలుగుడ్రామాల పార్టీ,తెలుగుదొంగల పార్టీ ఇప్పుడు తెలుగుహంతకుల పార్టీగా మారింది.
*మాకు అందిన సమాచారం ప్రకారం.అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు .ఉదయం అందరూ కూడా గుండెపోటు అన్నారు.పోస్టు మార్టం వచ్చాక హత్య అనే భావన కలిగింది.హత్య అని నిర్దారణ అయింది.అందుకే నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుతున్నాం.
*మంత్రి ఆదినారాయణ రెడ్డి ఓ హంతకుడు.హంతకుడే ఆరోపణలు చేయడం ఏంటి? ఎన్ని మర్డర్లు చేయించారో
అందరికి తెలుసు.స్వర్గీయ రాజారెడ్డిగారి హత్య ఎన్నికలకు ముందు జరిగింది.వైయస్ రాజశేఖరరెడ్డి మృతి ఎన్నికల తర్వాత నాలుగునెలలకు జరిగింది.ఆయనకున్న ఆదరణ చూడలేక ఎలిమినేట్ చేయడం జరిగింది.
నేడు వివేకానందరెడ్డిగారు ప్రజలతో మమేకం అయి పనిచేస్తారని తెలుసు.ఆయన ఉంటే అక్కడ ఆదినారాయణరెడ్డి రాజకీయమనుగడకు ప్రమాదం అని ఎలిమినేట్ చేయడం జరిగింది.ఇదంతా ఓ వ్యూహంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది.
*రేపు అంత్యక్రియలు జరుగుతాయి.
