ఏపీలో ప్రధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్ధులను ఇప్పుడే ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అలా వచ్చింది..ఇలా అన్ని పార్టీలు వేగం పెంచాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపు దాదాపుగా ఖాయం అయినట్లు అన్ని సర్వేలు చేబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నుండి జరగబోయో ఎన్నికల్లో పోటి చేసే వైసీపీ రేసు గుర్రాలు రెడీ అయ్యియి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, శాసనసభ స్థానాలకు వైసీపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు గాను తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.
