ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైసీపీ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిన్న వైసీపీలో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధువుల నార్నె శ్రీనివాసరావు కూడా వైసపీలో చేరారు. ఇవాళ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నార్నె వైసీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను పార్టీలో చేరడానికి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని నార్నె తెలిపారు.
