Home / 18+ / అకారణంగా ముగ్గురు వైసీపీ కార్యకర్తలను కొట్టిన టీడీపీ.. ఉద్రిక్తత

అకారణంగా ముగ్గురు వైసీపీ కార్యకర్తలను కొట్టిన టీడీపీ.. ఉద్రిక్తత

రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణుల అరాచ‌కాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం వైసీపీ నేతలు, కార్యకర్తలు “రావాలి జగన్‌ – కావాలి జగన్‌” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని మండపాల సెంటర్‌ నుంచి వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. కారణం లేకుండా కేవలం అక్కసు, అధికార అండతో దాడికి పాల్పడ్డారు. దీంతో అందరూ భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దాడితో పార్టీ కార్యకర్తలు జాన్‌బాషా, సుభాని, హుస్సేన్‌లకు గాయాలయ్యాయి.. గత నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఈ తరహా ఘటనలు కొత్తవేవీ కాదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat