ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయరు. మరో ముఖ్య విషయమేంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి అనుభవం, టాలెంట్ లేదు’ అని ఝా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ)
