ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి లాక్కున్న వేల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్డీఏ కమిషనర్కు సంక్రమించింది. అలాగే రహదారులు, మంచినీటి సరఫరా, సీవరేజ్, పార్కులు, ఇతర ప్రాజెక్టులకు అవసరమైన భూములను కాంట్రాక్టు సంస్థలకు కేటాయించే అధికారాన్ని కూడా సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం జీఓ ద్వారా అనుమతులిచ్చింది. రాజధాని భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతోపాటు సెక్యూరిటీగా పెట్టి సీఆర్డీఏ అప్పులు చేయనుంది. దీంతో వేల కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించడంపై అధికార వర్గాలపైనే అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో ఏ రంగం, ఏ శాఖలో చూసినా అప్పు అనే పదం వినిపించడం ద్వారా ఆస్తులను తాకట్టు పెట్టేసి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవాలని స్వయంగా చంద్రబాబు సూచిస్తున్నారని, దీంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం తీవ్రంగా పెరిగిపోతోందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సీఆర్డీఏ సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తుండగా సొంతం నిర్ణయాలు తీసేసుకుని సంబంధిత శాఖలు, ఆర్థిక శాఖకు పంపిస్తున్నారని, ఇలా చేయడం బిజినెస్ రూల్స్ కు విరుద్ధమట.. బ్యాంకుల నుంచి సీఆర్డీఏ రూ.10,000 కోట్ల అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. కానీ ఆస్తులను చూపించకపోతే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించలేదు. దీంతో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి లేదా సెక్యూరిటీగా చూపించి అప్పులు చేయాలని నిర్ణయించింది. ఈ విథంగా ఇప్పటికే రూ.2,000 కోట్ల అప్పులు చేయగా.. మరో రూ.10,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు సన్నద్ధమైంది మన చంద్రబాబు సర్కార్. ఈ విధంగా రాష్ట్ర ప్రజల నెత్తిమీద అప్పుల భారం మోపుతున్న చంద్రబాబు.
