ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అతి తెలివితేటలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే 2వేలు ఫించన్ ఇస్తానని ప్రకటించగానే చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేనిది హటాత్తుగా 2వేలకు పెంచారు. ఈ ఘటనను చూస్తున్న పలువురు సీనియర్లు గతంలో 1982 లో ముఖ్యమంత్రి కాబోయే ముందు ఎన్నికలలో ఎన్.టి.ఆర్ 2/- కిలో బియ్యం ప్రచారం చేసారు.
అయితే ఈ ప్రచారం నడుస్తుండగా దీన్ని కాపీకొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కరరెడ్డి రూ.1.90 కి బియ్యం ప్రకటన చేశారు. అయినా చిచ్చు చిత్తుగా ఓడి ఎన్టీఆర్ గెలిచారు. అయితే జగన్ పాదయాత్ర ద్వారా ఇస్తున్న హామీలను కాపీ కొడుతున్న చంద్రబాబు జగన్ హవాలో ఫ్యాను గాలి లో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.