Home / ANDHRAPRADESH / ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయం..ప్రముఖ సినీ నటుడు సంచలన వాఖ్యలు

ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయం..ప్రముఖ సినీ నటుడు సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సినీనటుడు పృధ్వీరాజ్‌ అన్నారు. వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌ నగర్‌లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృద్విరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు వీధుల్లో ప్రచారం చేశారు.

ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలనకు ముగింపు పలికేందుకు వైసీపీ నాయకులంతా ఉత్సాహంగా పనిచేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యం తీసుకురావాలన్నారు. వైఎస్‌ స్వర్ణయుగం రావాలంటే జగన్‌తోనే సాధ్యం అన్నారు. అంతేకాదు ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయం అంటున్నారు. ప్రస్తుతం పృధ్వీరాజ్‌ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat