కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ బేటీ ముగిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. ఇవాళ్టి సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు.
రాష్ట్రాంలో పరిస్థితిని సమీక్షించి.. ఒక నివేదిక ఇస్తుందని వివరించారు. హైదరాబాద్కు వచ్చే కేంద్ర బృందానికి ఎటువంటి సమాచారం ఇవ్వాలో చర్చించామన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే సరిచేస్తామన్నారు.తెలంగాణలో ఎన్నికల కసరత్తు, సంసిద్ధత అంశాలను సంఘానికి వివరించాం. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది