ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే
బెయిల్పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని ముస్లిం యువకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆవేదన వ్యక్తం చేశారు. దేశద్రోహులనే ముద్ర వేసి చిత్రహింసలకు గురిచేసారని వాపోయారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కేసులన్నీ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.తప్పుడు కేసులు పెట్టి అమాయక ప్రజలను బాధపెట్టడం అధికారపార్టీ కి అలవాటు అని చెప్పారు.
