ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గంటన్నర సేపు ప్రసంగించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు వెళ్లనున్నారు. ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది. కార్యక్రమాల అనంతరం మంత్రులు, ఇతర పార్టీ నేతలు మాట్లాడుతారు. చివరిగా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే నాలుగేళ్ల పాలనలో సాధించిన డెవలప్ మెంట్, ఉద్యమంనుంచి మొదలైన ప్రస్థానం నేడు జాతీయ స్థాయిలో ఏవిధంగా ముందుకెళ్తుంది.. వంటి అనేక అంశాలను కేసీఆర్ ప్రస్తావించనుండడంతో పాటు మరో యేడాదిలోపే ఎన్నికలు ఉండనున్న నేపధ్యంలో కొంగరకలాన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంది.
