ఏపీలో గత నాలుగేళ్లుగా వరుస నదీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెర్రీ లో బోటు ప్రమాదం, అంతర్వేదిలో పడవ బోల్తా, తూర్పుగోదావరి మరో బోటు ప్రమాదం ఇలా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా తాజాగా మరో ఘటన జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఘోర విషాదం చోటు చేసుకుంది.. కృష్ణానదిలో దిగడానికి సరదాగా వెళ్లిన నలుగురు విద్యార్ధులు మృతిచెందారు. మొత్తం ఎనిమిదిమంది కృష్ణానదిని చూసేందుకు వెళ్లగా నలుగురు గల్లంతయ్యారు. వీరంతా చిర్రావురు వాసులుగా గుర్తించారు. తాడేకోరు శివ (14), నీలం క్రాంతికుమార్ (10), నీలం శశి (8), దినేష్ (7) లు గల్లంతయినట్టు సమాచారం. తాజా ఘటనతో రాజధాని ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది.
