ఏపీలో మహిళలపై లైంగిక దాడులు వీపరితంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట చాల దారుణంగా బాలికలపై కామాంతో మగాళ్లు రెచ్చిపోతున్నారు. మరి ముఖ్యంగా విధ్యాభృఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు కళాశాల అద్దాలను, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డాబాగార్డెన్స్లోని విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని విద్యార్థినులు తెలిపారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు ఆగ్రహావేశాలతో కళాశాల అద్దాలు పగులగొట్టారు. ఫ్లెక్సీలను చింపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమకు విడిచి పెట్టాలంటూ విద్యార్థినులు రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు మద్దతు తెలియజేయకుండా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ కళాశాల విద్యార్థినులు స్టేషన్ ఎదుట బైటాయించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
