గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు – రాజకీయ నాయకులు విరాళాలందించారు. మరికొందరు బాధితులకు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేరళ వరద బీభత్సంపై వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. మూడ్రోజుల క్రితం అక్కడి పరిస్థితులు తనను కలచి వేసాయంటూ ఆవేదన చెందుతూ ట్వీట్ చేశారు. కేరళ ప్రకృతి బీభత్సం తన హృదయాన్ని కలిచివేస్తోందని జగన్ అన్నారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు – ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయని చెప్పారు. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన కేరళ ప్రజలకు సహాయ – పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరుతూ జగన్ ట్వీట్ చేశారు. తాజాగా కోటిరూపాయలు ఆర్ధిక సాయం చేసారు జగన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ సొమ్మును 10కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించి 5కోట్లు మాత్రమే ఇచ్చారు. వ్యక్తిగతంగా ఒక్కరూపాయి కూడా చంద్రబాబు ఇవ్వలేదు.
