మరో క్రికెటర్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ ఓపెనర్ను కలిసిన ఢిల్లీ బీజేపీ నేతలు అతనికి టికెట్ ఇవ్వడంపై కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ నుంచే గంభీర్ను బరిలోకి దింపాలని బీజేపీ చూస్తున్నది. దేశానికి సంబంధించి ఏ అంశంపై అయినా స్పందించడానికి గంభీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ విషయంలో గంభీర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బీజేపీ.. గౌతమ్ ని బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నదని తెలుస్తుంది.
