Home / ANDHRAPRADESH / ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’

‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’

నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మేధావి వర్గం అభిప్రాయపడింది. ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’ అనే అంశంపై ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐ) ఆదివారం అనంతపురంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా వెనుకబడిన ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదానే ఏకైకమార్గమని ప్రారంభం నుంచి పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆయన వెనుక చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే అక్రమ కేసులు బనాయించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెడితే ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు.

నిజాయితీగా ఉంటే విచారణను స్వాగతించాలన్నారు. మొదట ప్యాకేజీకి ఒప్పుకొని ప్రజా వ్యతిరేకతను చూసే యూటర్న్‌ తీసుకొని చంద్రబాబు హోదానినాదం అందుకున్నారన్నారు. దీనిపై అన్ని వర్గాలూ ఆలోచించాలన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి అంతా పేపర్లకే పరిమితమైందని వైసీపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ కలకడ విమర్శించారు. వైఎస్‌ జగన్‌ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటున్నారని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమైందని వైసీపీ సంక్షేమ సంఘం నాయకుడు భక్తవత్సలంరెడ్డి మండిపడ్డారు. ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. లక్షలాది మంది యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రత్యేక హోదా సాధనలో బీజేపీ, టీడీపీ రెండూ మోసగించాయని, దీనిపై అందరూ ఆలోచించాలని ఎన్‌ఆర్‌ఐ వెంకట్‌ అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat