Home / NATIONAL / గవర్నర్‌ కన్నుమూత..!

గవర్నర్‌ కన్నుమూత..!

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ ‌(90) ఇకలేరు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో రాయ్‌పూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్‌ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్రృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని రాజ్‌భవన్‌కు తరలించారు. బలరాం దాస్‌ టాండన్ మరణం పట్ల సీఎం రమణ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నాలుగేళ్ల పాటు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. విశేషానుభవం కలిగిన ఆయన తనకు పితృ సమానులని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat