ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం జగన్ పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు
