తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను టీ న్యూస్ ఎండీ,రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ స్వీకరించారు. హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చూసుకుంటానంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, సినీ నటుడు నాగార్జునకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
