ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. వేలాది మంది అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్ జగన్కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు. పెద్దాపురం పట్టణంలోని బ్యాంక్ కాలనీ, మున్సిపల్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, మరిడమ్మ తల్లి గుడి, వేములవారి సెంటర్, దర్గా సెంటర్ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సాయంత్రం పెద్దాపురం వేములవారి సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.