అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు, పోలింగ్ బుత్ సభ్యులకు….ఓ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వజ్రకరూరులో గురువారం మధ్యాహ్నం (26-07-2018) న అనగ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండల బుత్ కమిటీ సబ్యులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి,వైసీపీ రాష్ట్ర నాయకులు వై.శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య , వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ కిష్టప్ప తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కనుక ఈ శిక్షణ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బుత్ సభ్యులు తప్పక హాజరుకావాలని వైసీపీ పార్టీ వజ్రకరూరు, ఉరవకొండ నియోజకవర్గం వైసీపీ నేతలు చూచించారు.
