అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్ నుంచి 218వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సామర్లకోట మండలం గొంచాల, బ్రహ్మానందపురం, పీ.వేమవరం శివారు మీదుగా ఉండూరు వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకు 2,568.3 కిలోమీటర్లు నడిచారు.
వైఎస్ జగన్ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.