ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేక ఇటీవల ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
కాగా, ఇవాళ ఆయన తిరుపతిలోని ప్రెస్క్లబ్ భవనంలో మీడియాతో మాట్లాడారు. హాయిగా కలిసి మెలిసి ఉన్న మాల మాదిగలను ఏబీసీడీలుగా విభజిస్తానని చెప్పి.. వారి మధ్చ చిచ్చుపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఒకసారేమో మాలోళ్లు మంచివాళ్లని, మరోసారి మాదిగోళ్లు మంచివాళ్లని ఇలా ఇద్దరి మధ్య రోజు రోజుకు దూరం పెంచుతూ చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు అడుగు పెట్టిన ప్రాంతాల్లో.. కరువు తాండవిస్తుందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.