Home / ANDHRAPRADESH / చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిక..!

చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిక..!

ఇటీవల ఏపీ సచివాలయంలో తమ డిమాండ్లను తీర్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కారును క్షురకులు అడ్డుకోవ‌డంతో చంద్రబాబు కొంత ఆగ్రహానికి గురయ్యైయిన సంగతి తెలిసిందే. అయితే నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని అల్‌ ఇండియా నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్‌ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం ఆల్‌ఇండియా నాయి బ్రాహ్మణ సంఘం జాతీమ అధ్యక్షుడు రవీందర్‌ రాణా మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం క్షమపణ చెప్పకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat