ఆర్మూరులో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఎంజే హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయిలో దళితుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని మధుశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత డాక్టర్ మధుశేఖర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధుశేఖర్ వైద్యుడిగా ప్రజలకు గతంలో చేసిన సేవలను వారు అభినందించారు. మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నారు.
