తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్ళిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు మొక్కుకున్నారు.
see also:బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్
ఈ క్రమంలో ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు.ఈ నేపథ్యంలో ఏపీకి ముఖ్యంగా బెజవాడ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు అక్కడ భారీ స్థాయిలో స్వాగతం లభించింది.
see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
ఈ నేపథ్యంలో నగరానికి చెందిన కేసీఆర్ అభిమానులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నగరంలో ఆయన ప్లెక్సీలు భారీ స్థాయిలో అలంకరించారు.కొండపైకి స్వాగతం పలుకుతూ భారీ స్థాయిలో కట్టిన ప్లెక్సీలు అందర్నీ అకట్టుకుంటున్నాయి..