ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది . జగన్ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు.
see also:టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్ “
అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కొంకపల్లి, అమలాపురం వరకు 199వ రోజు పాదయాత్ర సాగనుంది. అమలాపురంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
see also;కేసీఆర్ను కెలికి గాలి తీసుకున్న బాబు
వైఎస్ జగన్ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి జగన్ కి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.