భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ హత్యకు కుట్ర జరిగిందా .ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఈ ప్లాన్ కు సిద్ధపడిందా ..అంటే అవును అనే చెప్పాలి .సరిగ్గా ఎనిమిదేళ్ళ కింద ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రదారి అయిన హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జమాత్ ఉద్ దవా మరోసారి పబ్లిక్ గా ప్రకటించింది .
పవిత్ర రంజన్ సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్ కోట్ లో మౌలానా బషీర్ అహ్మద్ అలీ మాట్లాడుతూ భారత్ అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుంది .
భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీను చంపేస్తాం .భారత్ ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు కావడం తధ్యం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాకుండా భారత్ ను ముక్కలు చేసి కాశ్మీర్ ను విడిపించేందుకు సిద్ధమైనట్లు ఆయన ప్రకటించేశాడు ..