హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పది అంతస్థులున్న మయూరీ కాంప్లెక్స్ పై నుంచి ఓ యువతి కిందికి దూకింది. తల పగలడంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అమ్మాయి మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టాగ కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. జెస్లీస్ భవనంలోని వెళ్లిన దృశ్యాలు, పై నుంచి దూకిన విజువల్స్ మీడియాకు చిక్కాయి. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
