హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. థెయాగ్ వద్ద ప్రమాదవశాత్తు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు టిక్కర్ ప్రాంతం నుంచి సిమ్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కొండ ప్రాంతంలో మితిమీరిన వేగంతో బస్సును నడిపాడని.. దీంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
