గత కొన్ని రోజులనుండి పెట్రోల్ ధరలు పెంచడంపై మోడీ సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ రోజు పెట్రోల్ ధరలను ఒక్క పైసా తగ్గిస్తునట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది .దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు కొంత ఊరట లభించినట్టు అయింది. మొదట 60 పైసల మేర పెట్రోలు,డీజిల్ ధర తగ్గినట్లు ప్రకటించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాన్ని సవరిస్తూ మళ్లీ 1పైసాగా మార్చింది. దీంతో ప్రధాన నగరాల్లో పెట్రోలు ధర లీటర్ పైన 1 పైసా తగ్గినట్లయింది. బుధవారం పెంచిన ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర డిల్లీ 78.42 , కోల్ కత్తా 81.05 , ముంబై 86.23,చెన్నై 81.42
ఇక ఢిల్లీలో బుధవారం పెంచిన ధరల ప్రకారం లీటర్ డీజిల్ ధర రూ.69.50గా ఉండగా, ముంబైలో రూ.73.78, కోల్కతాలో రూ.71.85, చెన్నైలో రూ.73.17 గా ఉంది. రూపాయల్లో పెంచి, కేవలం ఒకే ఒక పైసా మేర తగ్గించడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.